ముంబై : బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. డాలర్తో రూపాయి మారకం క్షీణించడం, ఆర్ధిక మాంద్యం భయాలతో ఖరీదైన లోహాలకు డిమాండ్ ఎగబాకింది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సోమవారం బంగారం, వెండి ధరలు భారమయ్యాయి. పది గ్రాముల బంగారం రూ 81 పెరిగి రూ 51,793 పలికింది.
ఇక కిలో వెండి రూ 209 పెరిగి రూ 57398కి చేరింది. బంగారం ధరలు ఎక్సైజ్ సుంకం, మేకింగ్ చార్జీలు, రాష్ట్రాల పన్నుల ఆధారంగా పలు ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, ఆర్ధిక మాంద్యం ఆందోళనలు, కరెన్సీల పతనం వంటి కారణాలతో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.