Gold Rates | న్యూఢిల్లీ, జూలై 18: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60 వేల పైకి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.600 అందుకొని రూ.77 వేలు పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,960 డాలర్లు, వెండి 24.91 డాలర్ల వద్ద ఉన్నాయి.