Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర సోమవారం ఒక్కరోజే రూ.1,298 పెరిగి రూ.53,784కు చేరుకున్నది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు మొగ్గుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ చెప్పారు. ఇంతకుముందు సెషన్లో పది గ్రాముల బంగారం ధర రూ.52,486 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1910 పెరిగి రూ.69,067 నుంచి రూ.70,977 లకు చేరుకున్నది.
ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనపడి సురక్షిత మదుపు మార్గాలకు మళ్లడంతో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ ఆల్టైం రికార్డు స్థాయికి పతనమైంది. 84 పైసలు నష్టపోయి 77.01 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.31 శాతం పెరిగి 1996 డాలర్లకు చేరితే, ఔన్స్ వెండి ధర 25.81 డాలర్ల వద్ద నిలిచింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో ఔన్స్ బంగారం ధర 2000 డాలర్ల దిశగా పరుగులు తీస్తున్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్నీత్ దమానీ చెప్పారు.
మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర తులం రూ.1,161 పెరిగి రూ.53,720కి చేరుకున్నది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం న్యూయార్క్లో 1.47 శాతం పెరిగి 1995.60 డాలర్లు పలికింది.