ముంబై, జనవరి 31: దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం వల్లనే 2022లో పసిడికి డిమాండ్ స్వల్పంగా 3 శాతం వరకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. 2022లో 774 టన్నుల డిమాండ్ నెలకొన్నదని పేర్కొంది. 2021లో నమోదైన 797.3 టన్నులతో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని తెలిపింది. వినియోగదారుల్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉండటం, పన్నులు, ధరలు పెరుగుతుండటంతో డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ ఎండీ సోమసుందరం తెలిపారు.