న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ రూ.116 పెరిగి రూ.46,337కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ బంగారం ధర రూ.46,221 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా మార్కెట్లు ఫ్లాట్గా ముగియడంవల్ల దేశీయంగా బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.161 పెరిగి రూ.67,015 కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,854 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,782 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.13 అమెరికన్ డాలర్లు పలికింది.