న్యూఢిల్లీ, జూన్ 5: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా అంతంత మాత్రంగానే ఉండటంతో గత మూడు రోజులుగా దిగువముఖం పట్టింది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.400 తగ్గి రూ.1.60 లక్షల దిగువకు రూ.1,59,900కి దిగొచ్చింది. అంతకుముందు ఇది 300గా ఉన్నది. కానీ, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. వెండి ఏకంగా రూ.5 వేలు ఎగబాకి రూ.2,60,700 పలికింది.