న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.301 తగ్గి రూ.46,415కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,716 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఢిల్లీలో ఇవాళ స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.402 తగ్గి రూ.59,044కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.59,446 వద్ద ముగిసింది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 11 పైసలు మెరుగుపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర రూ.1,789 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.08 అమెరికన్ డాలర్లు పలికింది.
ఇక హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.240 పెరిగింది. దాంతో గురువారం రూ.49,040గా ఉన్న బంగారం ఇవాళ రూ.49,250కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారట్ గోల్డ్ ధర కూడా ఇవాళ రూ.200 పెరిగింది. దాంతో గురువారం రూ.44,950గా ఉన్న ధర ఇవాళ 45,150కి చేరింది.