న్యూఢిల్లీ, జూన్ 21: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,200 తగ్గి రూ.72,300కి దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే దేశీయంగా ధరలు దిగొస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,936 డాలర్లకు, వెండి 23.09 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.