హైదరాబాద్, ఆగస్టు 25: గోద్రేజ్ ఇంటీరియర్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే మూడేండ్లలో తెలంగాణలో 25 కొత్త షోరూంలతోపాటు తన నెట్వర్క్ను 150 రిటైలర్లకు విస్తరించాలనుకుంటున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ నుంచి రూ.70 కోట్ల ఆదాయం సమకూరుతున్నదని, వచ్చే మార్చి నాటికి 100 కోట్లకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
అలాగే తెలంగాణలో ఇంటీరియర్ మార్కెట్ వాటా 21 శాతంగా ఉండగా, వచ్చే మూడేండ్లలో దీనిని 30 శాతానికి పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు, ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్లలో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చునన్నారు. ప్రస్తుతం భారత్లో ఫర్నీచర్ మార్కెట్ రూ.1.3 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నదని, ప్రతియేటా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నదని చెప్పారు.