న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న దేశీయ విమానయాన సంస్థ ఈ నెల 3న దివాలా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సర్వీసులను మూడు రోజులపాటు (3, 4, 5 తేదీల్లో) రద్దు చేస్తున్నట్లు మే 3న ప్రకటించింది. అనంతరం దానిని ఈ నెల 9 వరకు పొడిగించింది. అయితే పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో 12వ తేదీ వరకు షెడ్యూల్ చేసిన గో ఫస్ట్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, మే 26 వరకు అన్ని రకాల సర్వీసులను రద్దుచేస్తున్నట్లు మరోసారి సంస్థ వెల్లడించింది. తాజాగా వినాలను కాన్సలేషన్ను ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ నెల 15న కొత్త టికెట్ల విక్రయాలను సంస్థ నిలిపివేసింది. అప్పటివరకు అమ్మిన టికెట్లకు సంబంధించిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆ సంస్థను డీజీసీఏ (DGCA) ఆదేశించింది. కాగా, గో ఫస్ట్ ప్రమోటర్ వాడియా గ్రూప్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (NCLT)లో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విమాన సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ప్రణాళికను నెల రోజుల్లోగా సమర్పించాలని సంస్థ యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించినట్లు తెలుస్తున్నది.