శంషాబాద్, ఏప్రిల్ 3: జీఎమ్మార్ ఇన్నోవెక్స్ నూతన వ్యాపార విభాగాన్ని శనివారం జీఎమ్మార్ గ్రూప్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఖరోలా మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రయాణీకులు ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా విమానయానం చేయవచ్చన్నారు. ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడానికి జీఎమ్మార్ ఇన్నోవెక్స్ ఒక అద్భుతమైన కేంద్రంగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలను ఎంతో ప్రోత్సహిస్తున్నదని, జీఎమ్మార్ ఇన్నోవేషన్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జీఎమ్మార్ ఎయిర్పోర్టు బిజినెస్ విభాగం చైర్మన్ జీబీఎస్ రాజు, జీఎమ్మార్ విమానాశ్రయాల సీఐవో ఎస్జీకే కిశోర్, జీఎమ్మార్ ఇన్నోవేషన్ హెడ్ రామా అయ్యర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :