పెద్దపల్లిటౌన్, జూలై 5: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లిలోని మూడో వార్డులో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన పర్యటించారు. అత్యధికంగా మొక్కలు నాటిన కౌన్సిలర్ భిక్షపతికి శాలువా కప్పి సన్మానించి, అభినందించారు. 36 వార్డుల్లో పట్టణ ప్రగతి, హరితహారం వివరాలను సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మున్సిపల్ మేనేజర్ నయీంషాఖాద్రి, సిబ్బంది రాంమోహన్రెడ్డి, రాజు తదితరులున్నారు.
ప్రజల సహకారంతో ప్రగతి
పెద్దపల్లి జంక్షన్, జూలై 5: ప్రజల సహకారంతో పట్టణ ప్రగతి సాధ్యమవుతుందని డీఎంఏ (డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) సత్యనారాయణ అన్నారు. కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొ క్కలు నాటారు. ఎస్సీ కాలనీల్లో పర్యటించి సమ స్యలను గుర్తించి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా కృషి చేయాలని సూచించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ మేనేజర్ నయీంషాఖాద్రి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.