ముంబై, జూన్ 28: గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎనర్జీలో 2.2 శాతం వాటాను (3.52 కోట్ల షేర్లు) బ్లాక్ డీల్స్ రూపంలో విక్రయించగా, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
ఎస్బీ అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 2,300 ధరతో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను రూ.4,140 కోట్లకు అమ్మగా, ప్రమోటింగ్ సంస్థ ఇన్ఫినైట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకు రూ.920 ధరతో అదానీ గ్రీన్ షేర్లను రూ.4,232 కోట్ల లావాదేవీని పూర్తిచేసింది.