Adani Group | న్యూఢిల్లీ, ఆగస్టు 2: గౌతమ్ అదానీ కన్ను సంఘీ ఇండస్ట్రీస్పై పడింది. పశ్చిమ భారత్లో అగ్రగామి సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న సంఘీ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయానికి అదానీ గ్రూపు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు చర్చలు కూడా జరిపాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
అదానీ గ్రూపులో ఆర్థిక అవకతవకలు జరిగాయని హిండెన్బర్గ్ ఆరోపించిన తర్వాత ఇదే అతిపెద్ద ఒప్పందం కానున్నది. సంఘీ సిమెంట్స్లో మెజార్టీ వాటా కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఒప్పందాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రస్తుతం సంఘీ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్ విలువ 600 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది.