Adani | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: గౌతమ్ అదానీ.. శనివారం ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత పర్యటనలో ఉన్న ఆయనను అదానీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. దీంతో భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. ‘భారత్లో ఉబర్ విస్తరణకోసం ఆయన తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకం. ప్రత్యేకంగా దేశీయ డ్రైవర్ల గౌరవాన్ని పెంచడం ఆయన నిబద్దతకు నిదర్శనం. భవిష్యత్తులో ఆయ నతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాను’ అని గౌతమ్ అదానీ తన ఎక్స్లో పోస్ట్చేశారు.
రేవుల నుంచి ఎనర్జీ వరకు సేవలు అందిస్తున్న అదానీతో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉన్నదని, ముఖ్యంగా మొబిలిటీ సేవలు అందించడానికి తీసుకుంటున్న చర్యలను దారా అభినందించారు. అయితే దారాతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన అదానీ.. ఎక్కడ కలిసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వారం మొదట్లో భారత పర్యటనకు వచ్చిన దారా.. ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాగా, వచ్చే పదేండ్లకాలంలో అదానీ గ్రూపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది.