ముంబై, మే 16: గౌతమ్ అదానీకి చెందిన అదానీ టోటల్ గ్యాస్ షేరు కుప్పకూలుతున్నది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 79 శాతానికి పైగా నష్టపోయి లోయర్ సర్క్యూట్ను తాకింది. అదానీ గ్రూపులో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నట్టు అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఆరోపించిన నాటినుంచి ఇప్పటి వరకు టోటల్ గ్యాస్ సగానికి పైగా మార్కెట్ వాటాను కోల్పయింది.
మంగళవారం కంపెనీ షేరు ధర 5 శాతం తగ్గి రూ.738.60 లోయర్ సర్క్యూట్కు పడిపోయింది. ప్రస్తుత నెలలో జరిగిన 11 ట్రేడింగ్లలో ఎనిమిది రోజులు సంస్థ నష్టపోయింది. అదానీ గ్రూపు, ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీలు సంయుక్తంగా అదానీ టోటల్ గ్యాస్ను ఏర్పాటు చేశారు.