Yes Bank | రూ.5000 కోట్ల పై చిలుకు మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న యెస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్ సరికొత్త ఆరోపణ చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి న్యూయార్క్లో చికిత్స కోసం ఎంఎఫ్ హుస్సేన్ వేసిన చిత్రాలను బలవంతంగా కొనుగోలు చేశానని ఆరోపించారు. హుస్సేన్ చిత్రాలను కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వధ్రా నుంచి కొన్నానని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో చెప్పారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలియంశాఖ మంత్రిగా ఉన్న మురళీదేవ్రా సదరు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ కొనుగోలు చేయడానికి నిరాకరించారన్నారు. అంతే కాకుండా తనకు పద్మ భూషణ్ పురస్కారం రాకుండా అడ్డుకున్నారని రాణా కపూర్ చెప్పారు. సోనియాగాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోనివ్వలేదేని చెప్పుకొచ్చారు. ఒకవేళ సదరు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ కొనుగోలు చేయకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని మురళీ దేవ్రా బెదిరించాడన్నారు.
2018లో యెస్ బ్యాంకు జారీ చేసిన డిబెంచర్లను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (డీహెచ్ఎఫ్ఎల్) కొనుగోలు చేసింది. దానికి ప్రతిగా రాణా కపూర్ కుటుంబ సభ్యుల పేరిట గల మరో కంపెనీకి డీహెచ్ఎఫ్ఎల్ రుణం మంజూరు చేసింది.