హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఆహారశుద్ధి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో ఇంజినీరింగ్ తర్వాత అత్యధికంగా ఈ రంగానివే కావడం విశేషం. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం, అలాగే ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా గుర్తించడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. టీఎస్ ఐ-పాస్తో ఇప్పటి వరకు 22 వేల యూనిట్లకు అనుమతులు మంజూరు కాగా, వీటిలో ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించినవి 4,126 ఉన్నాయి. వీటితోపాటు ఆగ్రో ఇండస్ట్రీస్, సిమెంట్-కాంక్రీట్ ఉత్పత్తులు, ప్లాస్టిక్, రబ్బర్ పరిశ్రమలు, గ్రానైట్ తదితర పరిశ్రమలు కూడా అధికంగా ఏర్పాటయ్యాయి.
తెలంగాణ ఆహారశుద్ధి పరిశ్రమ ముఖ్యాంశాలు….