న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart Electronics sale) మరో న్యూ సేల్ ఈవెంట్తో ముందుకొచ్చింది. ఫ్లిఫ్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లైవ్లో ఉండగా ఇది మార్చి 30 వరకూ కొనసాగుతుంది. ఈ డీల్లో భాగంగా 5జీ ఫోన్లపై ఆకర్షణీయ డీల్స్ను ఈకామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. పలు 5జీ ప్రీమియం ఫోన్లపై డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లతో ధరలు మరింత అందుబాటులో ఉన్నాయి.
పోకో ఎక్స్5 ప్రో, ఐఫోన్ 13, వివో వీ27 సహా ఇతర 5జీ ఫోన్లు సేల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్లో ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ రూ. 61,999 డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ. 2000 డిస్కౌంట్ను కూడా లెక్కిస్తే ఐఫోన్ 13 రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేస్తే 256జీబీ స్టోరేజ్ మోడల్ కేవలం రూ. 74,999కి లభిస్తోంది.
ఇక ఇతర 5జీ ఫోన్లను చూస్తే.. రెడ్మి నోట్ 12 ప్రో ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్లో డిస్కౌంట్ ధరపై రూ. 24,999కి అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై రూ. 2000 డిస్కౌంట్తో ఈ స్మార్ట్ఫోన్ను రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు. వివో వీ27ను ఫ్లిప్కార్ట్ సేల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ. 30,499కే దక్కించుకోవచ్చు. మెరుగైన కెమెరా ఫోన్ కోసం చూసేవారికి వివో వీ27 మేలైన ఎంపిక. ఇక రూ. 31,999కి లభించే గూగుల్ పిక్సెల్ 6ఏ డివైజ్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్లో రూ. 29,999కి సొంతం చేసుకోవచ్చు.
Read More :
అవాంఛిత కాల్స్, సందేశాలపై ట్రాయ్ గరం