న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ క్లియర్ ట్రిప్ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సొంతం చేసుకోనున్నది. క్లియర్ ట్రిప్ సంస్థలోని మొత్తం వాటాలను కొనుగోలు చేస్తామని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు తమ కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ప్లిప్కార్ట్ మొత్తం షేర్లు కొనుగోలు చేసి.. నిర్వహణ బాధ్యతలను టేకోవర్ చేసినా.. క్లియర్ ట్రిప్ ప్రత్యేక బ్రాండ్గానే కొనసాగుతుంది.
సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు తమ కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ప్లిప్కార్ట్ మొత్తం షేర్లు కొనుగోలు చేసి.. నిర్వహణ బాధ్యతలను టేకోవర్ చేసినా.. క్లియర్ ట్రిప్ ప్రత్యేక బ్రాండ్గానే కొనసాగుతుంది.
క్లియర్ ట్రిప్ సంస్థ ఉద్యోగులందరూ యథావిధిగా కొనసాగుతారు. ఫ్లిప్కార్ట్తో కలిసి సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తారు. ఈ సంస్థ టేకోవర్కు ఫ్లిప్కార్ట్ ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిందన్న వివరాలు వెల్లడి కాలేదు. అయితే, క్లియర్ ట్రిప్- ఫ్లిప్కార్ట్ మధ్య కుదిరిన ఒప్పందం విలువ 40 మిలియన్ డాలర్లు ఉండవచ్చునని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
‘డిజిటల్ వేదికగా వినియోగదారులకు అద్భుతమైన అనుభూతినందించేందుకు కట్టుబడి ఉన్నాం. పర్యటనలకు క్లియర్ ట్రిప్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఆ బ్రాండ్ను కొనసాగిస్తూనే, కొత్త ప్రాంతాల్లో సంస్థను వృద్ధి చేస్తాం. పెట్టుబడులు ఇందుకు మరింత ఉపకరిస్తాయని భావిస్తున్నాం’ అని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.
పర్యాటక రంగం, టెక్నాలజీ విషయంలో క్లియర్ట్రిప్కు ఎంతో అనుభవం ఉందని కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఫ్లిప్కార్ట్ గ్రూప్నకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
పెట్రో సెగలతో ధరల మంట
కొవిడ్పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
15 నెలల్లో ఈ ఐఐటీయన్ సంపదెంతంటే!