Halwa Ceremony | వచ్చే ఆర్థిక సంవత్సరా (2023-24) నికి బడ్జెట్ రూపకల్పనలో సంప్రదాయం ప్రకారం జరిగే `హాల్వా` వేడుక గురువారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో సాగింది. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యక్రమానికి హాజరై హల్వా గరిట తిప్పి.. అధికారులకు, సిబ్బందికి హల్వా వడ్డించారు. తదుపరి బడ్జెట్ ప్రెస్లో పర్యటించి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్ ముద్రణ పనుల సన్నాహాలు సమీక్షించారు.
ప్రతి ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా కార్యక్రమం నిర్వహణ ఆనవాయితీగా వస్తున్నది. కరోనా వల్ల గతేడాది ఈ కార్యక్రమం జరుగలేదు. గత రెండు రెండేండ్లుగా పేపర్లెస్ బడ్జెట్లను నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించారు. వచ్చే ఏడాది (2023-24) ఆర్థిక సంవత్సర బడ్జెట్ను కూడా ఫిబ్రవరి ఒకటో తేదీన పేపర్లెస్గానే సమర్పిస్తారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం ఇది ఐదవసారి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్కు ఈ బడ్జెట్ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది.