హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ఓక్..తాజాగా హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. రామచంద్రాపురం వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను తెలుగు హీరో నిఖిల్ సిద్దార్థ శనివారం ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా అవుట్లెట్ల సంఖ్య 148కి చేరుకున్నది.
ఈ సందర్భంగా రాయల్ఓక్ ఫర్నీచర్ చైర్మన్ విజయ్ సుబ్రమణియమ్ మాట్లాడుతూ…21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్లో అన్ని రకాల ఫర్నీచర్లు లభించనున్నాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో 18 స్టోర్లు ఉండగా..వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను రెండింతలు 35కి పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.