హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణులు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వేదిక ఫాలింగ్ వాల్స్ ల్యాబ్..హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. విద్యావేత్తలు, వ్యవస్థాపకులు, నిపుణులు వారి వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులను పంచుకోవడానికి గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఆగస్టు 19 ఐడియా పిచ్ డేను నిర్వహిస్తున్నారు.