మానకొండూర్, జూలై 8: మండల వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమం జోరుగా సాగుతున్నది. గురువారం మండల కేంద్రంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పాటు ఇతర కూలీలు డ్రైనేజీలు, వీధులను శుభ్రం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారికి ఇరువైపులా ఉపాధికూలీలు మొక్కలు నాటారు. పార్కు నిర్మాణ పనులను జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్తోకలిసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నెల్లి మురళి, పంచాయతీ కార్యదర్శి తుల్జారాణి, వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
తిమ్మాపూర్, జూలై 8: హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీడీ మంజులాదేవి అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. గురువారం మండలంలోని రేణికుంట, నేదునూర్ గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్షెడ్లు, నర్సరీలు, డంప్యార్డులు, వైకుంఠధామాలను ఆమె పరిశీలించారు. నాలుగో విడుత పల్లెప్రగతిలో భాగంగా చేపడుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల రక్షణకు కంచె ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం నాటిన కమ్యూనిటీ ప్లాంటేషన్, మంకీఫుడ్ కోర్టులను వందశాతం సంరక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనంతరం పల్లెప్రగతిలో భాగంగా ఆమె మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోయిని కొమురయ్య, వడ్లూరి శంకర్, ఎంపీడీవో చింతర రవీందర్రెడ్డి, ఎంపీవో కిరణ్కుమార్, ఏపీవో స్వాతి, టీఏ హరీశ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారులు, వార్డు సభ్యులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ కోర్టుతో కోతుల సమస్య పరిష్కారం
మంకీ ఫుడ్ కోర్టుల ఏర్పాటుతో గ్రామాల్లో కోతుల సమస్య పరిష్కారమవుతుందని వయోజన విద్య డీడీ, మండల ప్రత్యేకాధికారి జయశంకర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామాల్లోని వీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పూడ్చివేశారు. రోడ్లను శుభ్రం చేశారు. చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి మక్తగుర్జాలగుట్ట వద్ద ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టును సందర్శించారు. మొక్కల ఎదుగుదలకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక్కడ గ్రామ ప్రత్యేకాధికారి శ్రావణి, పంచాయతీ కార్యదర్శి వంశీ, టీఆర్ఎస్ నాయకుడు నెలవేని మహేశ్, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
మొకలతోనే పర్యావరణ పరిరక్షణ
మొకల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణకు సమతుల్యత ఏర్పడి మానవ మనుగడ సజావుగా సాగుతుందని ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్ పేర్కొన్నారు. గురువారం పల్లె ప్రగతిలో భాగంగా ఆయా గ్రామాలో చేపట్టిన కార్యాక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా ఇంటింటా మొకలు నాటాలని, పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒకరూ మొకలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పల్లెప్రగతిలో భాగంగా ఎనిమిదో రోజు రామంచ, ఇందుర్తి, బొమ్మనపల్లి,రేకొండ, నవాబుపేట, ముదిమాణిక్యం తదితర గ్రామాల్లో శిధిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. బొమ్మనపల్లి లో వైకుంఠధామం ఆవరణలో జడ్పీటీసీ ప్రజా ప్రతినిధులతో కలిసి మొకలు నాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయించారు. అనంతరం శ్రమదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, సోషల్ వెల్ఫేర్ డీడీ నతానియర్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీవో జిల్లా రాధ, ఈసీ రాజయ్య, మండల ప్రత్యేకాధికారులు విజయలక్ష్మి, శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్, శైలజ, సాయికుమార్, వంశీధర్, సర్పంచులు జకుల రవి, పిట్టల రజిత, సుద్దాల ప్రవీణ్, కానుగంటి భూమిరెడ్డి, గుంటి మాధవి, అందె స్వరూప పంచాయతీ కార్యదర్శులు లావణ్య, స్వర్ణలత, మైలారపు జ్యోతి, శామారాణి, వెంకట రమణారెడ్డి, సుమంత్ తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
ఊటూర్లో గురువారం పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచ్ ఎలగందుల సుదర్శన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. గ్రామంలో ఉన్న ఖాళీ స్థలంతో పాటు రోడ్డుకు ఇరువైపులా, గ్రామ శివారుల్లో మొక్కలు నాటి, ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. పోచంపల్లిలో ఎంపీవో ప్రభాకర్ వైకుంఠధామం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సిరిశెట్టి రాజేందర్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, అంగన్వాడీ టీచర్ శైలజ, వీవో రజిత, గ్రామస్తులు పాల్గొన్నారు.