న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (ఈపీఎఫ్ఓ) తమ ఉద్యోగులకు దీపావళికి ముందు తీపికబురు వెల్లడించింది. గ్రూప్ సీ, గ్రూప్ బీ (నాన్-గెజిటెడ్) ఉద్యోగులందరికీ ఉత్పాదక ఆధారిత బోనస్ (పీఎల్బీ) అందించనున్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది.
ఈ బోనస్ కింద అర్హులైన ఈపీఎఫ్ఓ ఉద్యోగులు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రూ. 13.806 వరకూ గరిష్టంగా పొందుతారు. గ్రూప్ బీ, గ్రూప్ సీకి చెందిన తాత్కాలిక, పర్మినెంట్ ఉద్యోగులందరికీ బోనస్ అందచేస్తామని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే క్యాజువల్, కాంట్రాక్ట్, అదనపు ఉద్యోగులు బోనస్ పొందేందుకు అర్హులు కారు.