న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధ్వంసం గురించి వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తాజాగా లేటెస్ట్ టెక్నాలజీపై బాంబు పేల్చారు. ఏఐతో కొలువుల కోత తప్పదని, చరిత్రలో ఇది అత్యంత వినాశనకారిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఏఐ గురించి మస్క్ ఇటీవల బ్రిటన్ ప్రదాని రిషీ సునాక్తో ముచ్చటించిన క్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీ మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐ భద్రతా సదస్సు సందర్భంగా వీరిరువురు భేటీ అయిన సంగతి తెలిసిందే. చరిత్రలోనే విధ్వంసక శక్తిగా ఏఐ రాబోయే రోజుల్లో మనుషులు చేసే అన్ని ఉద్యోగాలను కనుమరుగు చేస్తుందని ఈ సందర్భంగా మస్క్ హెచ్చరించారు. విధ్వంసం దిశగా పయనించే ఏఐ కట్టడికి నియంత్రణ అవసరమని ఏఐకి ఓ రిఫరీ ఉండటం మంచిదేనని మస్క్ పునరుద్ఘాటించారు.
ఏఐతో మనం అసలు ఉద్యోగాలు అవసరం లేని దశకు చేరుకుంటామని చెప్పారు. ఏఐ అన్ని పనులు చేసి పెడుతుందని మీరు వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగం కోరుకుంటే చేయవచ్చని ఈ పరిస్ధితిలో మంచి, చెడు రెండూ ఉన్నాయని మస్క్ చెప్పుకొచ్చారు.
Read More :
Rohini Nilekani: ఈ ఏడాది 170 కోట్లు దానం చేసిందామె.. రోహిణి నిలేకని గురించి మీకు తెలుసా?