Electric Vehicles | వినియోగదారుల ఆమోదం, మౌలిక వసతుల కల్పన, టెక్నాలజీ, ప్రభుత్వ రాయితీలు సక్రమంగా సాగితే దేశంలో వచ్చే ఎనిమిదేండ్ల (2030)లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ 78 శాతానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ వెహికల్స్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 3000 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వెయ్యి ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఆరు అందుబాటులో ఉన్నాయి. ఐసీఈ (ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్స్)తో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఖరీదు 20-70 శాతం తక్కువ అని స్ట్రాటర్జీ కన్సల్టింగ్ సంస్థ రెడ్ సీర్ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడంతోపాటు ఖర్చుల్లో పొదుపు పెరుగుతుందని తెలిపింది.
మెరుగైన ఫీచర్ల (ఇంటరాక్టివ్ డాష్బోర్డులు, కనెక్టివిటీ, డ్రైవింగ్ ఫీచర్లు)తోపాటు వాటి ధర, ఖర్చు తక్కువగా ఉండటం వల్లే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎంపిక చేసుకోవడంలో ప్రధాన కారణం. బెటర్ పెర్ఫార్మెన్స్ (ఇన్స్టంట్ యాక్సిలరేషన్) ఆఫర్తోపాటు అత్యంత పర్యావరణ అనుకూల వాహనం కావడం మరో కారణం.
నిర్వహణ ఖర్చు అతి తక్కువగా కావటంతోపాటు కనిష్ట ఇంధన ఖర్చు ఉండటంతో వ్యాపార వేత్తలు
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల వైపు మొగ్గుతున్నారని రెడ్ సీర్ ఎంగేజ్మెంట్ మేనేజర్ ముకేశ్ కుమార్ తెలిపారు. సుదీర్ఘ చార్జింగ్ సమయం, తక్కువ చార్జింగ్ మౌలిక వసతులు ఎలక్ట్రిక్ వెహికల్స్కు సవాళ్లు కానున్నాయి. అయినా.. ప్రభుత్వ రాయితీలను పొందేందుకు వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి పలు స్టార్టప్ సంస్థలు.. దేశంలో మెరుగైన ఈవీ చార్జింగ్ వసతుల కల్పనకు ముందుకొస్తున్నాయి.