Business News | న్యూఢిల్లీ, మార్చి 9: ఐటీ, ఆడియోవిజువల్ తదితర సర్వీసు రంగాల ఎగుమతులకు, వృత్తినిపుణులకు అవకాశాల్ని కల్పించే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ ఆదివారం సంతకాలు చేయనుంది. సభ్యదేశాలైన ఐస్లాండ్, లీచ్టెనిస్టయిన్, నార్వే, స్విట్జర్లాండ్తో కూడిన యూరోపియన్ బ్లాక్ ఈఎఫ్టీఏ (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్)తో జరిగే ఈ ఒప్పందం ద్వారా వచ్చే పదేండ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని, అటువంటి పెట్టుబడుల ద్వారా దేశంలో 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి బ్లాక్కు ఎగుమతయ్యే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాల తగ్దింపు ఉంటుందని, ప్రాసెస్డ్ వ్యవసాయ ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల మార్కెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాకుండా ఫార్మా, మెడికల్ డివైస్లు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి రంగాలు కూడా ఒప్పందంలో భాగంగా ఉంటాయని, సోయా, డెయిరీ తదితర సున్నిత వ్యవసాయోత్పత్తులను జాబితా నుంచి మినహాయిస్తారని, ఈ ఐటెమ్స్కు సుంకాల రాయితీలు ఉండబోవని అధికారులు వివరించారు.