న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ ప్రత్యక్ష పన్నుల చట్టాలను ఉల్లంఘించిందంటూ ఫ్లిప్కార్ట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థతోపాటు తొమ్మిది మందికి ఈ నోటీసులు పంపింది.
పెట్టుబడుల నిబంధనలు అతిక్రమించినందుకు రూ.10,600 కోట్ల (1.35 బిలియన్ల డాలర్లు) జరిమానా చెల్లించాలని ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించింది. మూడు నెలల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2009-15 మధ్య పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా)ను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
ఈడీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఫ్లిప్కార్ట్.. తాము ఎఫ్డీఐ నిబంధనలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. భారత చట్టాలకు అనుగుణంగానే తమ సంస్థలో పెట్టుబడులను ఆహ్వానించామని ఓ ప్రకటనలో పేర్కొంది.
అయినా ఈడీ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని వివరించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు జరపడం చట్టప్రకారం నిషేధమని ఈడీ వాదన.