హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్పై నమోదైన కేసులో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు వేగం పెంచారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు..బుధవారం కంపెనీ చైర్మన్ పార్థసారథి నివాసంతోపాటు ఆయన కార్యాలయంలోనూ సోదాలు జరిపినట్లు సమాచారం. ఈ సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.