హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ):బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై నమోదైన కేసులో పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అటాచ్ చేసింది. చెన్నైకు చెందిన పీసీహెచ్ లైఫ్ైస్టెల్ యజమాని బల్విందర్సింగ్, ఇతరులు చెన్నైలో జార్జ్ టౌన్లో పంజాబ్ సింద్ బ్యాంక్ నుంచి రూ.22.15 కోట్ల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించలేదు.
దీనిపై చెన్నై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్, బెంగళూరులో సదరు కంపెనీకి చెందిన రూ.6.18 కోట్ల విలువైన 11 ఆస్తులను జప్తు చేశారు.