దేశ జీడీపీ 2024-25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్లు)ను చేరాలంటే మౌలిక రంగాభివృద్ధికి దాదాపు రూ.110 లక్షల కోట్లు (1.5 ట్రిలియన్ డాలర్లు) అవసరమని ఆర్థిక సర్వే తెలిపింది. 2008-17 మధ్య మౌలిక రంగంలోకి సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల నిధులను చొప్పించారు. ఈ క్రమంలోనే 2020-25 మధ్య 1.5 ట్రిలియన్ డాలర్లను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని కేంద్ర ప్రభుత్వం తాజా సర్వే ద్వారా తెలియజేసింది. తద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నది.