Festive Season Sale | ఈ కామర్స్ కంపెనీలు ఈ ఏడాది పండుగ సీజన్లో వార్షిక విక్రయాలు 28శాతం పెరిగి.. రూ.వెయ్యికోట్లకుపైగా చేరుకోవచ్చని భావిస్తున్నాయి. 2018తో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ షాపర్ల సంఖ్య రెట్టింపు కావొచ్చని స్ట్రాటజిక్ అడ్వైజరీ సంస్థ రెడ్సీర్ ఓ నివేదికలో పేర్కొన్నది. నివేదిక ప్రకారం.. పండుగ సీజన్ సెప్టెంబర్ రెండోవారం తర్వాత నుంచి ప్రారంభమై దీపావళి వరకు కొనసాగనున్నది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభంకానుండడంతో.. ఆన్లైన్లో విక్రయాలు 11.8 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని రెడ్సిర్ పేర్కొంది.
గత సంవత్సరంతో పోలిస్తే 28 శాతం పెరిగినట్లేనని రెడ్సిర్ పేర్కొంది. పండుగ సీజన్ మొదటి వారంలోనే అమ్మకాలు 5.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫ్యాషన్ విభాగంలో ఆన్లైన్ షాపింగ్ ఈ సంవత్సరం పెరుగుతుందని, టైర్-2 నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేట్ పార్టనర్ సంజయ్ కొఠారి మాట్లాడుతూ 2018తో పోలిస్తే ఆన్లైన్ షాపర్ల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ర్యాపిడ్ డిజిటల్ అడాప్షన్తో పాటు టైర్-2 నగరాల్లో ఆన్లైన్ షాపింగ్ చొచ్చుకుపోవడమే కారణమన్నారు.