న్యూఢిల్లీ, మార్చి 11: స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీలు) మహి ళా సభ్యులకు తాము వ్యవసాయ రంగంలో ఉపకరించే 200 డ్రోన్లను అందించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. వివిధ ఎస్హెచ్జీలకు ప్రధాని మోదీ 1000 డ్రోన్లు అందచేశారని, అందులో 200 తాము సరఫరా చేసినవి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లోని మహిళా ఎస్హెచ్జీ సభ్యులు వీటిని ఉపయోగిస్తారన్నది. ఈ డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు స్థానిక మహిళా పైలెట్లకు కోరమాండల్ శిక్షణ ఇచ్చింది.