ముంబై, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండటం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సెన్సెక్స్ 1,092 పాయింట్లు కోల్పోయి 74,775.74 వద్ద ముగిసింది.
నిఫ్టీ 359.40 పాయింట్లు పడి 23,547.75 వద్ద స్థిరపడింది. దీంతో మదుపర్ల సంపద రూ.5,77,442.84 కోట్లు కరిగిపోయి రూ.4,64,97,814.78 కోట్ల(4.88 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఇండిగో షేర్ విలువ భారీగా తగ్గింది.