ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం, యూరోపియన్ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా లాభాలకు పరోక్షంగా దోహదం చేశాయి.
మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 235.05 పాయింట్లు లాభపడి 60,392.77 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 90.10 పాయింట్లు అందుకొని 17,812.40 పాయింట్ల వద్ద నిలిచింది. గత ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్ 2,779.05 పాయింట్లు , నిఫ్టీ 860.7 పాయింట్లు పెరిగాయి.