ముంబై, ఆగస్టు 18: దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది.
ట్రేడర్లలో సెంటిమెంట్ నిరాశాజనకంగా ఉండటంతో ఒక దశలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 202.36 పాయింట్లు కోల్పోయి 64,948.66 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 55.10 పాయింట్లు కోల్పో యి 19,310.15 వద్ద జారుకున్నది. తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన సూచీ మధ్యాహ్నాం తిరిగి లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను పడేశాయి.