ముంబై, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా నాలుగు రోజుల్లో నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవడం, గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించినప్పటికీ సూచీలు లాభాల్లోకి వచ్చాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 160 పాయింట్లు లాభపడి 62,570.68 వద్ద ముగిసింది. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 48.85 పాయింట్లు అందుకొని 18,609.35 వద్ద స్థిరపడింది.