న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత నెల 11 శాతం పెరిగాయి. తయారీదారుల నుంచి డిమాండ్కు తగ్గ వాహనాల సరఫరా మార్కెట్లోని డీలర్లకు ఉండటంతో విక్రయాలు జోరుగా సాగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ తెలిపింది.
సెప్టెంబర్లో మొత్తం రిటైల్ సేల్స్ 14,64,001 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్లో 13,19,647 యూనిట్లుగానే ఉన్నట్టు ఫెడరేషన్ వివరించింది. ఈ క్రమంలో ఈ నెల అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాను డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్ జోష్ ఉంటుందని చెప్తున్నారు.