న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,876 కోట్ల లాభంతో పోలిస్తే 42 శాతం అధికమని పేర్కొంది. సమీక్ష సమావేశంలో కంపెనీ ఆదాయం రూ.26,749 కోట్ల నుంచి రూ.32,060 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.