న్యూఢిల్లీ, నవంబర్ 25: విమాన ప్రయాణికులు రికార్డు స్థాయికి చేరారు. ఈ నెల 23న దేశీయంగా ఎయిర్ ట్రావెలర్స్ 4 లక్షలకుపైగా నమోద య్యారు. 4,63,417 మంది ప్రయాణించినట్టు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు 24న అంతర్జాతీయ ప్రయా ణికులు లక్ష దాటారు. 1,06, 827 మందిగా ఉన్నట్టు తెలిపారు.
కరోనాతో కుదేలైన విమానయాన రంగం తిరిగి పుంజుకున్నదని, మునుపటి స్థాయికి చేరుకున్నదన్నారు. కాగా, ఈ నెల 19, 20, 21, 22 తేదీల్లో కూడా దేశ, విదేశీ ప్రయాణికులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. పండుగ సీజన్తోపాటు క్రికెట్ వరల్డ్ కప్ కావడంతో విమాన ప్రయా ణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకొచారు.