న్యూఢిల్లీ : బ్రీత్అనలైజర్ టెస్ట్ సందర్భంగా పైలట్లు, విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడటంపై నిషేధం విధిస్తూ భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ముసాయిదాను తీసుకువచ్చింది. పెర్ఫ్యూమ్స్లో ఆల్కహాల్ కంటెంట్ ఉండటంతో అవి బ్రీత్అనలైజర్ టెస్ట్పై ప్రభావం చూపడంతో డీజీసీఏ ఈ ప్రతిపాదనను ముందుకుతెచ్చింది.
తాజా ముసాయిదా ప్రకారం విమాన సిబ్బంది ఎవరూ ఎలాంటి మెడిసిన్, ఫార్ములేషన్, మౌత్వాష్, టూత్జెల్, పెర్ఫ్యూమ్ వంటి ఆల్కహాల్ కంటెంట్ ఉన్న వాటిని వాడరాదని, ఇది పాజిటివ్ బ్రీత్అనలైజర్ రిజల్ట్కు దారితీస్తుందని డీజీసీఏ ముసాయిదా పేర్కొంది.
ఫ్లైయింగ్ అసైన్మెంట్ చేపట్టేముందు ఇలాంటి మెడికేషన్ వాడే విమాన సిబ్బంది ఎవరైనా కంపెనీ డాక్టర్ను సంప్రదించాలని డీజీసీఏ చీఫ్ వెల్లడించారు. ఇది ముసాయిదా సీఏఆర్ (సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్) మాత్రమేనని ఈ రంగంలోని వారందరి అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచుతున్నామని డీజీసీఏ చీఫ్ తెలిపారు.
Read More :