BOB and BOI | రెండు కేంద్ర ప్రభుత్వ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సీఈఓలను నియమించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మేనేజింగ్ డైరక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా దేబదత్త చంద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా రజనీశ్ కర్నాటక్లను నియమిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ కం సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేబదత్త చంద్ మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో దేబదత్త చంద్.. ఇదే బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతో వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి దేబదత్త చంద్ మూడేండ్ల పాటు బీవోబీ ఎండీ కం సీఈఓగా ఉంటారు.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ కం సీఈఓగా ఉన్న సంజీవ్ చద్దా స్థానంలో దేబదత్తా చంద్ నియమితులయ్యారు. వాస్తవంగా గత జనవరి 19న సంజీవ్ చద్దా రిటైర్ కావాల్సి ఉన్నా.. ఆయన పదవీ కాలాన్ని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల అధిపతుల నియామకానికి ఏర్పాటైన ఎఫ్ఎస్ఐబీ గత జనవరిలో దేబదత్త చంద్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. తదనుగుణంగా కేంద్రం చంద్ను బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా రజనీశ్ కర్నాటక్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.