న్యూఢిల్లీ, మార్చి 1: పశ్చిమ దేశాలు ఆంక్షల్ని పెంచుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు స్థావరాల్ని అప్రమత్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర భగ్గుమన్నది. సోమవారం బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల స్థాయిని అధిగమించి, 105 డాలర్ల వద్దకు పెరిగింది. ఈ స్థాయికి ముడి చమురు ధర పెరగడం గత ఏడేండ్లలో ఇదే ప్రధమం. ప్రపంచంలోనే చమురు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న రష్యా నుంచి సరఫరాలు జరగవన్న భయాలతో క్రూడ్ ధర ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.