న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మార్కెట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ధరల నియంత్రణ, నిర్ణయాల్లో కుమ్మక్కయ్యారంటూ బీర్ల కంపెనీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం కొరడా ఝుళిపించింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్), కార్ల్స్బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సీఐపీఎల్), ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ (ఏఐబీఏ)లతోపాటు మరో 11 మందిపై ఏకంగా రూ.873 కోట్లకుపైగా జరిమానా విధించింది. ఏపీసహా పలు రాష్ర్టాల్లో బీర్ల అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్ స్వేచ్ఛను దెబ్బతీశారంటూ సీసీఐ ఈ ఫైన్ వేసింది. దాదాపు నాలుగేండ్ల సమగ్ర దర్యాప్తు అనంతరం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేయగా, యూబీఎల్పై రూ.752 కోట్లు, కార్ల్స్బర్గ్పై రూ.121 కోట్లు జరిమానా పడింది. ఏఐబీఏ, మరికొందరిపై రూ.6.25 లక్షలు ఫైన్ వేసింది.