న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్లను జారీ చేశామని ఐటీ శాఖ బుధవారం వెల్లడించింది.
రూ 33,548 కోట్ల విలువైన ఆదాయ పన్ను రిఫండ్లను, రూ 78,492 కోట్ల విలువైన మొత్తాన్ని కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్ల కింద ఆయా పన్ను చెల్లింపుదారులకు జారీ చేశామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది.