Gadkari To Tesla | దిగుమతి సుంకాల్లో రాయితీపై గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవోకు ఎలన్మస్క్కు కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చేశారు. భారత్లో కార్ల తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సాహకాల సంగతి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. అలా కాకుండా చైనాలో తయారు చేసి, భారత్లో అమ్ముతామని అంటే కుదరదని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనను తాము జీర్ణించుకోలేమని శనివారం మీడియాకు చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. బీఎండబ్ల్యూ, వోల్వో, హ్యుండాయ్, ఫోక్స్ వ్యాగన్, రెనాల్ట్, హోండా వంటి కంపెనీలు భారత్లో తయారీ యూనిట్లు నెలకొల్పాయని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా టెస్లా కంపెనీకి రాయితీలు ఇస్తే పాత కంపెనీలకు అన్యాయం చేసినట్లవుతుందన్నారు. దీనికి తోడు చైనాలో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉద్యోగాలు కల్పిస్తే, భారత్లో కార్లు అమ్ముకుని లాభాలు గడిస్తామనడం తమకు మింగుడు పడటం లేదని పేర్కొన్నారు.
భారత్లో టెస్లా కార్లను విక్రయించడానికి బెంగళూరులో ఆఫీసును టెస్లా కంపెనీ రిజిస్టర్చేసింది. విద్యుత్ వాహనాలైనందున పన్ను రాయితీ ఇవ్వాలని కోరింది. కానీ భారత్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపిస్తేనే రాయితీలు ఇస్తామని, లేదంటే భారీ పన్నులు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో భారత్ వంటి మార్కెట్ను వదులుకోలేక.. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వలేకపోతున్నారు. ఎలన్మస్క్. కానీ తనకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.