న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,656 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,832 కోట్లతో పోలిస్తే 29 శాతం అధికమైంది. ఏడాది క్రితం రూ.26,218 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.32,334 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.