G-20 Presidency | జీ-20 సభ్య దేశాల గ్రూప్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్నది. అందుకు అవసరమైన జీ-20 సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ సదస్సుకు భారత్ అధ్యక్షతన వహిస్తుంది.
వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనున్నది. దాని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమలుకు వెసులుబాటు కలిగించడం కోసం సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
గ్లోబల్ ఆర్థిక సుపరిపాలనలో ముఖ్య పాత్ర పోషించే జీ-20 గ్రూప్కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటైన ఫోరం జీ-20. ఈ జీ-20 సెక్రటేరియట్ 2024 ఫిబ్రవరి వరకు విధులు నిర్వర్తిస్తుంది.గతేడాది ఇటలీ అధ్యక్షతన జీ-20 సదస్సు జరుగగా, ఈ ఏడాది నవంబర్లో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనున్నది.