న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో ఎడాపెడా సాగుతున్న మాస్ లేఆఫ్స్ దశ ఇటీవల కొద్దిగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితి నెలకొంటోందనే అంచనాల మధ్య మళ్లీ టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్స్కు తెగబడటం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సిటీ గ్రూప్ కొలువుల కోతపై ఉద్యోగులకు వార్నింగ్ ఇవ్వగా, లేటెస్ట్గా ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ అదే బాట పట్టింది.
టెక్ రంగంలో కొలువుల కోత మరోసారి ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఖర్చులకు కత్తెర వేయడం, వ్యాపార పునర్వ్యవస్ధీకరణ పేరుతో కంపెనీలు ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక ఏడాది కాలంగా ఉద్యోగుల తొలగింపు, నిధుల కటకట వంటి సంక్లిష్ట సమస్యలతో సాగుతున్న ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ (Layoffs) కఠిన నిర్ణయం తీసుకుంది. నూతన భారత సీఈవో సారధ్యంలో పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కంపెనీ మరో విడత లేఆఫ్స్కు తెగబడుతున్నట్టు తెలిసింది. తాజా లేఆఫ్స్తో 4000 మంది ఉద్యోగులపై వేటు పడనుందని చెబుతున్నారు.
సీనియర్ మేనేజ్మెంట్పై వెచ్చిస్తున్న ఖర్చును తగ్గించుకునే క్రమంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్పైనా తాజా లేఆఫ్స్ ప్రభావం ఉండనుంది. కంపెనీ ఇండియన్ న్యూ సీఈవో అర్జున్ మోహన్ నియామకం అనంతరం తాజా లేఆఫ్స్ తెరపైకి వచ్చాయి. ఈ లేఆఫ్స్లో సామర్ధ్యం అంచనాలను అందుకోలేని ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులపైనా వేటు పడనుందని వార్తలు వచ్చాయి.
టెకీలు ఏం చేయాలంటే..!
లేఆఫ్స్ బెడద నుంచి తప్పించుకోవాలంటే నైపుణ్యాలకు పదును పెట్టుకోవడంతో పాటు ఏఐ, కోడింగ్, రోబోటిక్స్ వంటి న్యూ టెక్నాలజీలపై పట్టు పెంచుకోవాలని, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్